ప్రయాణికునికి సహాయం చేసిన పోలీసులు

525చూసినవారు
ప్రయాణికునికి సహాయం చేసిన పోలీసులు
హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో బస్ మిస్ కావడంతో ఒక ప్రయాణికునికి జన్నారం పోలీసులు సహాయం చేశారు. ఉట్నూర్ కు చెందిన పృథ్విరాజ్ బుధవారం రాత్రి ఆర్టిసి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో జన్నారంలో ఆయన కాల కృత్వాలు తీర్చుకునేందుకు దిగడంతో బస్ వెళ్లిపోయింది. పృథ్విరాజ్ జన్నారం పోలీసులు శ్రీనివాస్, నీలయ్యలను సంప్రదించగా, వారు జన్నారం మండలంలోని చింతగూడ వద్ద బస్సును ఆపి అదే బస్సులో ఆయనను పంపించారు.

సంబంధిత పోస్ట్