బాసరలో వెంకటేశ్వర స్వామి పల్లకి ఊరేగింపు

59చూసినవారు
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి వెంకటేశ్వర స్వామి పల్లకిని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఉగాది పండగ మరుసటి రోజు పల్లకి ఊరేగింపు ఆనవాయితీ నిర్వహిస్తున్నట్టు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్