తానూర్ మండలంలోని హాంగిర్గా గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం రాత్రి గ్రామస్తుల ఆలయ కమిటీ అధ్వర్యంలో అఖండ హరినామ సప్తాహం కార్యక్రమాన్ని గ్రామస్తులు భజన మండలి సభ్యులు ప్రారంభించారు. గాత భజన. ప్రవచనం, హరిపాఠ, కీర్తన, కాకడ హారతి, జ్ఞానేశ్వరి పారాయణం, శ్రీరామ్ చరిత్ర గాత, కార్యక్రమాలు నిర్వహించారు. వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.