పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

590చూసినవారు
పోషక విలువలున్న ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని అంగన్వాడీ టీచర్లు, కాంత, గంగామణి అన్నారు. బుధవారం లోకేశ్వరం మండలం ఎడ్దూర్, పొట్పెళ్లిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు ఎత్తు, బరువులను కొలిచి పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు ఆకుకూరలు, పండ్లు పాలు, పోషక విలువలున్న ఆహార పదార్థాలు రోజువారి ఆహారంలో ఉండేలా చూసుకుంటే తల్లి బిడ్డలిద్దరి క్షేమమని అన్నారు.

సంబంధిత పోస్ట్