ఇంటింటికి మొక్కలు పంపిణీ

72చూసినవారు
ఇంటింటికి మొక్కలు పంపిణీ
భైంసా మండలం ఖత్గాం గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎపిఓ శివలింగయ్య కోరారు. అనతరం పాఠశాల, అంగన్వాడీ, గ్రామ పంచాయితీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఏ శ్రీధర్, ఎఫ్ఏ శేఖర్, కార్యదర్శి శివనంద్ మాజీ సర్పంచ్ రాజు, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్