లొకేశ్వరం మండలంలోని శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. ఉరుములకు చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న రైతులు పిడుగు శబ్దానికి భయపడి పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని కొందరూ వీడియోలో చిత్రీకరించారు.