గంజాయి స్వాధీనం.. తల్లి, కొడుకు రిమాండ్

54చూసినవారు
భైంసా పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశుమందిర్ వద్ద మహ్మద్ బషీర్ గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో ఎస్ఐ నారాయణ్ సింగ్ దాడి చేసి పట్టుకున్నారు. 186 గ్రాముల గంజాయి పొడి స్వాధీనం చేసుకుని ఇందులో తన తల్లి మోసీన్ బేగం ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకోగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్