వంతెన దాటుతూ చిక్కుకుపోయిన వ్యక్తిని కాపాడిన ఎస్ఐ

69చూసినవారు
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దింతో మండలంలో ఝరి (బి)గ్రామం సమీపంలోని వంతెన పై నుండి వరద నీరు ప్రవహించడంతో ఝరి (బి)గ్రామానికి చెందిన గౌహతం వంతెన దాటుతున్న క్రమంలో వరద ప్రవాహం పెరగడంతో ఎరుక్కుపోయాడు. గ్రామాస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న ఎస్ఐ సందీప్ గ్రామస్తుల సహాయంతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్ఐ ని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్