నవరాత్రి మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈఓ

53చూసినవారు
బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో గురువారం నుండి జరిగే దసరా నవరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు బుధవారం ఆలయ ఈఓ విజయ రామరాజు తెలిపారు. ముఖ్యంగా మూలనక్షత్రం నుంచి భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని క్యూలైన్లలో భక్తులకు పాలు, బిస్కెట్లు అందజేస్తామని తెలిపారు. మొదటిరోజు సరస్వతీ అమ్మవారు శైలపుత్రీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్