పదో తరగతి వార్షిక ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 99. 09 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కేక్ కట్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులను అభినందించారు. 2023 - 24 పదవ తరగతి వార్షిక పలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమని అన్నారు.