శిథిలావస్థలో పాఠశాల భవనం

52చూసినవారు
శిథిలావస్థలో పాఠశాల భవనం
నిర్మల్ మండలంలోని అనంత పేట్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఐదు నుంచి పదో తరగతి వరకు నిర్వహించే ఈ పాఠశాలలో నాలుగు గదులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పై పెచ్చులూడి పోతున్నాయి. వర్షాకాలం కురుస్తోంది. దీంతో రెండు గదుల్లో ఇరుకుగా తరగతులు నిర్వహిస్తున్నారు. సుమారు ఏడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నా పట్టించుకునే వారు లేరని గ్రామస్థులు వాపోతున్నారు. అదనపు గదులు నిర్మించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్