ఐసిడిఎస్ పిడి రసూల్ బి అంగన్వాడీలపై సీఐటియు యూనియన్ నుండి బయటికి రావాలని లేనియెడల తనిఖీల పేరుతో మెమోలు జారీ చేస్తానని హెచ్చరిస్తున్న తీరును మార్చుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అడిషనల్ కలెక్టర్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. అంగన్వాడి సమస్యలపై ప్రశ్నిస్తున్న సిఐటియు యూనియన్ నుండి బయటకు రావాలని ఎటువంటి ఆందోళనలు చేయవద్దని అంగన్వాడీలను భయాందోళనకు గురి చేయడం సరి కాదని అన్నారు.