నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలో గుర్తు తెలియని శవం

79చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వలో గుర్తు తెలియని శవం
బాన్సువాడ సెగ్మెంట్ వర్ని మండలం చందూర్ గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలో గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైనట్లు వర్ని ఎస్ఐ. కృష్ణకుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం కాలువలో స్థానికులు శవాన్ని గుర్తించి సమాచారం ఇచ్చారని తెలిపారు. సంఘటన స్థలం వద్ద పరిశీలిస్తే మృతుడు బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్టు ధరించి ఉన్నట్లు ఎస్ఐ తెలుపుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్