పొలం వద్ద కుప్పకూలి రైతు మృతి
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పప్పుల నాగిరెడ్డి అనే రైతు పశువుల కోసం ఉదయం పొలం వద్ద గడ్డి కోస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. దీంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, నాగిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.