వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో కలిసి వెంకటపూర్ వద్ద ఉన్న సాయి కృష్ణ రైస్ మిల్ ప్రాంతంలో సోమవారం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న సంచిని చెక్ చేయగా గంజాయి లభ్యమైనది అని ఎస్ఐ తెలిపారు. 2 కిలోల 100 గ్రాముల బరువు ఉందనీ తెలిపారు, వారిని విచారించగా సయ్యద్ అజీమ్(30) షేక్ అద్నాన్ సోహెల్ (20) ఇద్దరు నిర్మల్ కి చెందిన వారని తెలిసింది,