బోధన్: రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది

80చూసినవారు
బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో జనని యూత్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రతన్ టాటా వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు. ఆయన గొప్ప వ్యాపారవేత్త అని, ఆయన దేశానికి చేసిన అనేక సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ రతన్ టాటాను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు గంగాధర్, లైన్ మెన్ చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్