నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ లో గల నవీపేట రెసిడెన్షియల్ పాఠశాలలో జెసిఐ ఇందూర్ ఆధ్వర్యంలో మంగళవారం క్రొది నామ ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ నరసింహ కట్ట హాజరై మాట్లాడారు. మనిషి ఎదుగుదలకు కంటి చూపు కీలకమన్నారు. విద్యార్థులు విటమిన్ ఏ పోషకహారం తీసుకొని కంటిచూపును కాపాడుకోవాలన్నారు.