రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

26414చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మరి గంగారాం, సాయమ్మల కొడుకు రాజేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రాజేష్ బైక్ పై పొలానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన మరొక బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్