నిజామాబాద్ జిల్లా కేంద్ర ంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్ మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్ష వ్యవహారంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పి రంజిత్, బి రఘురాం, పి హనుమన్లు, అంజలి, రాధాకుమార్, వంశీ పాల్గొన్నారు