మంటలంటుకుని రైతు మృతి
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ప్రమాదవశాత్తు మంటలంటుకుని ఓ రైతు మృతిచెందాడు. పెదవాల్గోట్ గ్రామానికి చెందిన లాయిడి కిషన్(58) పోత్నూర్ గ్రామ శివారులోని తన పంట పొలం వరి కంకులకు నిప్పు పట్టాడు. ఈ క్రమంలో మంటలంటుకుని కిషన్ మృతిచెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.