నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన తెలంగాణ వాది బాపూజీ

70చూసినవారు
నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన తెలంగాణ వాది బాపూజీ
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్ర పటానికి కమిషనర్ పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు, దోపిడీ దొరలకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.

సంబంధిత పోస్ట్