పోచారం ప్రాజెక్టు జలాశయంలో పెరుగుతున్న వరదనీరు

77చూసినవారు
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని అయిన పోచారం ప్రాజెక్టులోకి ఆదివారం ఉదయం నుండి మళ్ళీ వరద నీటి ఉద్ధృతి పెరుగుతుందని ప్రాజెక్టు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు లింగంపేట్ పెద్ద వాగు ద్వారా 5, 207క్యూసెక్కుల వరద నీరు వస్తుందని, వచ్చిన నీరంతా కూడా ప్రాజెక్టు వరద గేట్లు, కట్ట కాజ్ వే పై నుండి మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వెళ్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్