లిక్కర్‌ స్కామ్‌ వల్లే ఢిల్లీలో సీట్లు రాలేదు: కాంగ్రెస్‌ నేతలు

58చూసినవారు
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే కాంగ్రెస్‌ పార్టీ తన మిత్రపక్షమైన ఆప్‌ పై బ్లేమ్‌గేమ్‌ ప్రారంభించింది. ఢిల్లీలో పోటీ చేసిన సీట్లలో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి లిక్కర్ స్కామే కారణమని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌దత్‌ అన్నారు. తాము గనుక ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు. ఢిల్లీలో నీటి సంక్షోభం వస్తే మంత్రి అతిషి చర్యలు తీసుకోవాల్సిందిపోయి నిరాహారదీక్ష పేరుతో డ్రామా చేసిందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్