హైదరాబాద్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ను కూల్చేసిన ఘటన మురువక ముందే మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. తాజాగా మణికొండలో ఇటీవల నిర్మించిన 225 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విల్లాలకు సంబంధించి.. గత సొసైటీ పాలకవర్గం అడ్డదారిలో అనుమతులు పొందినట్టు అధికారులు గుర్తించారు.