కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడు, JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గర్ల్ ఫ్రెండ్ కు పోలీసులు నోటీసులు పంపారు. ఏప్రిల్ 26న దేశం విడిచి రేవణ్ణ జర్మనీ పారిపోయారు. అక్కడ ప్రజ్వల్ కు గర్ల్ ప్రెండ్ సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణకు హాజరుకావాలని ఆమెకు నోటీసులు పంపారు. కాగా ఈ కేసులో ప్రజ్వల్ తో పాటు ఆయన తల్లి భవానీని శనివారం అధికారులు ఐదు గంటల పాటు విచారించారు.