బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయిన జంట.. రూ.11వేలు జరిమానా విధించిన అధికారులు

55చూసినవారు
ఢిల్లీలోని వికాస్ పురిలో ఓ జంట బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో యువతిని బైక్ ట్యాంకుపై కూర్చోబెట్టి ఓ వ్యక్తి డ్రైవింగ్ చేశాడు. ఈ క్రమంలో సదరు యువతి ప్రపంచాన్ని మర్చిపోయి అతడిని గట్టిగా హగ్ చేసుకుంది. ఇతర వాహనదారులు ఫోన్ లో రికార్డు చేసి ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు బైకర్ కు రూ.11వేల జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్