మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. గాయత్రీ దేవాలయం సమీపంలో ఓ వృద్ధుడు రోడ్డు దాటేందుకు యత్నించాడు. అయితే లారీ డ్రైవర్ తొలుత ఆగినా, వెంటనే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో లారీ చక్రాల కింద నుజ్జు నుజ్జు అయి వృద్ధుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. మృతుడిని వల్లభనగర్కు చెందిన విజయ్ ప్రతాప్ భాస్కర్ రావు (59)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.