నిత్య విద్యార్థిగా ఉండేవారే విజయం సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం పీఎంవోలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాలామంది తన విజయ రహస్యం ఏమిటి అని అడుగుతుంటారని.. నిత్య విద్యార్థిగా ఉండటమే తన విజయ రహస్యం అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనుకున్నది సాధించాలంటే అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.