వైసీపీ నేత కేశినేని శ్రీనివాస్(కేశినేని నాని) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. తాజా ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని.. టీడీపీ అభ్యర్థి, ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.