కోవింద్‌ను కలిసిన ఒవైసీ

79చూసినవారు
కోవింద్‌ను కలిసిన ఒవైసీ
'వన్ నేషన్ వన్ ఎలక్షన్'పై హై లెవెల్ కమిటీ ఛైర్మన్ రామ్ నాథ్ కోవింద్‌ను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బుధవారం కలిశారు. ఢిల్లీలో కోవింద్‌తో పాటు కమిటీ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. వారితో తొలుత వ్యక్తిగత సంభాషణలు జరిపారు. అనంతరం కమిటీకి తమ పార్టీ అభిప్రాయాలను సమర్పించారు. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' భావన బహుళపార్టీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం & ఫెడరలిజానికి విపత్తు అని ఒవైసీ గతంలో వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్