ప.గో. జిల్లా కలెక్టర్ గా IPS ఉమేశ్ చంద్ర భార్య

80చూసినవారు
ప.గో. జిల్లా కలెక్టర్ గా IPS ఉమేశ్ చంద్ర భార్య
క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టులు, మావోయిస్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత IPS ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి ప.గో. కలెక్టర్ గా నియమితులయ్యారు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద నలుగురు నక్సలైట్లు ఉమేశ్ చంద్రను కాల్చి చంపారు. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆయన సేవలకు గౌరవంగా నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె పదోన్నతులు పొందుతూ తాజాగా ప.గో. జిల్లా కలెక్టర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్