తిరుపతి స్విమ్స్ లో వైద్యురాలిపై రోగి దాడి, తమకు భద్రత కల్పించాలంటూ ట్రైనీ డాక్టర్ల ఆందోళన

579చూసినవారు
తిరుపతి స్విమ్స్ లో వైద్యురాలిపై రోగి దాడి, తమకు భద్రత కల్పించాలంటూ ట్రైనీ డాక్టర్ల ఆందోళన
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో శనివారం ఓ రోగి డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై దాడి చేశాడు. సదరు డాక్టర్ ఎమర్జెన్సీ వార్డులో ఉండగా, వెనక నుంచి వచ్చిన పేషెంట్ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి వైద్యులు, ఇతర పేషెంట్ల బంధువులు అతడి బారి నుంచి ఆమెను కాపాడారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. డాక్టర్లకే భద్రత లేదా అంటూ నిరసన చేపట్టారు. సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని పలు కథనాలు పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్