ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన నడుస్తుంది: జనార్దన్ రెడ్డి

63చూసినవారు
తెలంగాణలో ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన నడుస్తుందని BRS నేత మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో మొలచింతలపల్లి పాశవిక ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సత్యవతి రాథోద్, సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పరామర్శించారు. 'ఆడబిడ్డపై ఘోరమైన పాశవిక దాడి జరిగి 7 రోజులైనా ఇప్పటికి నిందుతులపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వాన్ని చుస్తే సిగ్గు అనిపిస్తుంది. సీఎం రేవంత్, భట్టి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్