ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్రావును ఐదు రోజులపాటు పోలీసుల కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్ట్లో విచారణ జరిగింది. కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో ఇవాళ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.