తెలంగాణ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఆధారంగా కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ప్రత్యేక పీపీ నియామకంపై నాంపల్లి కోర్టు ఈనెల 15న నిర్ణయం తీసుకోనుంది.