ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నట్లు BRS సీనియర్ నాయకులు వినోద్ కుమార్ అన్నారు. 'రైతుబంధు పథకం గురించి చర్చించాలి. ప్రధానితో సహా చాలా మంది రైతుబంధు పథకాన్ని స్వాగతించారు. పంట కోతల తర్వాత రేవంత్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదు. రైతుభరోసా అమలు చేసి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారు.