జమ్ముకశ్మీర్లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ప్రధాని మోదీ ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ట్వీట్ చేశారు.