ఐపీఎల్లో ముంబై కెప్టెన్సీ మార్పుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అభిమానులను హత్తుకుంటోంది. పాక్పై తీవ్ర ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుండగా పాండ్య షాదాబ్ ఖాన్ వికెట్ తీశారు. దీంతో కెప్టెన్ రోహిత్.. పాండ్యను ఎత్తుకుని అభినందించారు. నిన్న బ్యాటింగ్లో విఫలమైన ఈ ఆల్రౌండర్ రెండు కీలక వికెట్లు తీసి, గెలుపులో కీలకపాత్ర పోషించారు.