ఇవాళ ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నిషాన్ ఉన్నత పాఠశాలలో మోదీ తన ఓటు వేయనున్నారు. ఇవాళ మూడోదశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా గుజరాత్లోని 25 స్థానాలకూ పోలింగ్ నిర్వహించనున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.