మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 15, 17న కేరళలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు ఈ రోజు తెలిపాయి. మోదీ మార్చి 15న కేరళలోని పాలక్కడ్కు వెళ్లనున్నారు. ఆ తర్వాత 17న బీజేపీ అభ్యర్థి అనిల్ కే ఆంటోనీకి మద్దతును కూడగట్టడానికి మరోసారి పతనంతిట్టలో పర్యటించనున్నారు. పాలక్కడ్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు.