పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులు, భూఆక్రమణలకు పాల్పడుతున్న అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికొచ్చింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించే అంశాన్ని పరిశీలిస్తామని సీజేఐ డి.వై.చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ అంశంపై సీబీఐ లేదా సిట్తో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ గురువారం పిల్ దాఖలు అయింది.