6 నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి

50చూసినవారు
6 నెలల్లోనే కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి
బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆ పార్టీ తెలంగాణ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'లోక్‌సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అత్యధిక ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ పోటీ చేయలేదు.. ఎంఐఎం పోటీ చేసింది. లోపాలు సరిదిద్దుకుని భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో 6 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మొదలైంది' అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

సంబంధిత పోస్ట్