మహారాష్ట్ర పూణే స్వర్గేట్ బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సులో 26 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మహారాష్ట్ర ఆర్టీసీకి చెందిన స్వర్గేట్ డిపో మేనేజర్ సహా నలుగురు అధికారులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ముంబైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీలో రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ ప్రకటన చేశారు.