ఒక సినిమాపై అసహనం వ్యక్తం చేస్తూ నటి రాధిక శరత్కుమార్ తాజాగా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘ఏదైనా సినిమా చూసి మీరు విసిగిపోయారా? నాకు అయితే ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేయాలనిపించింది. చాలా ఆగ్రహంగా ఉంది’’ అని ఆమె రాసుకొచ్చారు. ఇది నెట్టింట వైరల్గా మారింది. రాధిక మాట్లాడుతున్నది ‘యానిమల్’ గురించేనని భావిస్తున్నారు. ఆ సినిమాలో చాలా సన్నివేశాల్లో హింసను తీవ్రస్థాయిలో చూపించారని పలువురు విమర్శలు చేశారు.