BRSపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

65చూసినవారు
BRSపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
BRSపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఆ లేఖలో రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30కోట్లతో ఓట్ల కొనుగోలుకు BRS తెరలేపిందని, BRS అధికారిక కెనరా బ్యాంక్ ఖాతా నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు నగదు బదిలీ చేసిందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్