రాహుల్ గాంధీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు: అమిత్ షా

77చూసినవారు
రాహుల్ గాంధీ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు: అమిత్ షా
అమెరికా పర్యటనలో బాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రతిసారీ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతారని ఫైర్ అయ్యారు. రాహుల్ కు దేశ వ్యతిరేక ప్రకటనలు చేసే అలవాటు ఉందని విమర్శించారు. రాహుల్ రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడి, వాటిపై కాంగ్రెస్ వ్యతిరేకతను మరోసారి తెరపైకి తెచ్చారని అమిత్ షా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్