ప్రధాని మోదీ పాలనలో దేశంలో రైలు ప్రయాణం శిక్షగా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ ఎక్స్ప్రెస్లో రైలులో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన ఓ వీడియోను ట్యాగ్ చేస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు. నిర్ధారిత టికెట్లతో కూడా ప్రజలు తమ సీట్లలో ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారని చెప్పారు. తమ విధానాలతో రైల్వేను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.