ఒకేసారి 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం వర్తిస్తుందని Dy.CM భట్టి విక్రమార్క ప్రకటించారు. రాజీవ్ యువ వికాసానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను ఎంపీడీవో కార్యాయాలయంలో అధికారులకు ఇవ్వాలని చెప్పారు. అన్ని పరిశీలించి జూన్ 2న మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పారు. కాగా, కాసేపటికి క్రితమే ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో CM రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే.