తెలంగాణ విద్యార్థులకు తెలుగు పాఠ్య పుస్తకం ముందుమాటలో తప్పులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తక ముద్రణ సేవల డైరెక్టర్ శ్రీనివాసాచారిపై, SCERT అదనపు డైరెక్టర్ రాధారెడ్డిపై కూడా చర్యలు తీసుకుంది. పాఠ్య పుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసాచారి, రాధారెడ్డిని తొలగించింది. SCERT డైరెక్టర్గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేష్కు బాధ్యతలు అప్పగించింది. TREIS కార్యదర్శి రమణకుమార్కు ముద్రణ సేవల డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది.