తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను కార్గో సేవల ద్వారా TSRTC ఇంటి వద్దకే తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ గడువు ముగియగా.. తాజాగా ఈ నెల 25వ తేదీ వరకు TSRTC పొడిగించింది. రూ. 151కే లభించే రాములోరి కళ్యాణ తలంబ్రాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. బుక్ చేసుకోవడానికి వెబ్ సైట్: tsrtclogistics.in